Home  »  TV News  »  Eto Vellipoyindhi Manasu : భార్యకి గులాబీ ఇచ్చి క్షమాపణ చెప్పిన భర్త.. అతను ముంబై వెళ్ళాడా!

Updated : Jul 19, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు' . ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -152 లో.. రామలక్ష్మి ఒంటరిగా కూర్చొని.. అసలు అత్తయ్య ప్లాన్ ఏంటని ఆలోచిస్తుంటుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. పాపం రామలక్ష్మి జరిగింది తలుచుకుంటూ బాధపడుతున్నట్ల ఉందని అనుకొని.. తనకి ఒక రోజ్ ఫ్లవర్ తీసుకొని వస్తాడు. నాకు ప్రపోజ్ చేయడానికేమో అని రామలక్ష్మి అనుకుంటుంది. కానీ ఆ రోజ్ ఫ్లవర్ ఇస్తూ సీతాకాంత్ సారీ చెప్తాడు. నువ్వు సెలక్ట్ అయిన జాబ్ కి నా వాళ్ళ రిజైన్ చేశావని సీతాకాంత్ అనగానే.. మీరు నన్నేం చెయ్యమనలేదు.. నేనే చేశా.. ఇందులో మీరెందుకు సారీ చెప్తున్నారని రామలక్ష్మి అంటుంది. అయిన నీకు అంత సడన్ గా జాబ్ ఎందుకు చెయ్యాలనిపించిందని సీతాకాంత్ అడుగుతాడు.

ఇప్పుడు నిజం చెప్పిన నమ్మే సిచువేషన్ లో లేరని రామలక్ష్మి అనుకొని‌.. ఆఫీస్ లో అయితే మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చని సిగ్గుపడుతూ వెళ్లిపోతుంటే.. సీతాకాంత్ తనపై ప్రేమ ఉందని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత సందీప్ ఆఫీస్ కి వెళ్తున్నాడని శ్రీవల్లి తనకి దగ్గర ఉండి రెడీ చేస్తుంది. తనకి అన్ని రకాల టిఫిన్ రెడీ చేస్తుంది. దగ్గర ఉండి వడ్డీస్తుంది. అదంతా రామలక్ష్మి చూస్తుంటుంది. కొంతమంది కుళ్ళుకుంటున్నారు.. నీకు దిష్టి తియ్యలని రామలక్ష్మి వంక చూస్తూ శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి దేవుడికి మొక్కుతూ.. బాధపడుతుంటే శ్రీలత తన దగ్గరకి వెళ్తుంది. నీ భర్తని ఆఫీస్ నుండి దూరంగా పంపిస్తాను.. ఏం చేసుకుంటావో చేసుకోమని శ్రీలత సవాలు అంటుంది. మరొకవైపు ఏంటి సీత నువ్వు చెప్పేది నిజమా.. రామలక్ష్మి నీ కోసమే జాబ్ చెయ్యాలి అనుకుందా.. చూసావా తనకి కూడా నువ్వు ఇష్టమని పెద్దాయన అంటాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు.. రామలక్ష్మి ఆఫీస్ లో నీ పక్కన జాబ్ ఇవ్వాలి.. ఉన్న జాబ్ ని తీసేస్తావో లేక జాబ్ క్రియేట్ చేస్తావో నీ ఇష్టమని పెద్దాయన అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మికి నేను ఇష్టమైతే అంతకు మించి ఏముందని సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు.

ఆ తర్వాత అందరు టిఫిన్ చేస్తుంటారు. సిరి, పెద్దాయన కలిసి సీతాకాంత్ పక్కన రామాలక్ష్మికి చైర్ వదిలేసి కూర్చుంటారు. ఆ తర్వాత సందీప్ టిఫిన్ చేశాడా అని సీతాకాంత్ అనగానే.. చేసాడని శ్రీవల్లి అంటుంది. అదిగో ఫైల్స్ చూస్తున్నాడని శ్రీవల్లి చెప్తుంది. మీకు మాట రాకూడదు కదా అన్నయ్య అని సీతాకాంత్ తో సందీప్ అంటాడు.. ఆ తర్వాత ధన ఎక్కడ అని సిరిని సీతాకాంత్ అడుగగా.. బిజినెస్ పని మీద ముంబై వెళ్ళాడని సిరి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.